ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక సంక్షోభం- కాగ్ నివేదిక మీద సమగ్ర విశ్లేషణ. Thread👇🏻

సంక్షేమం పేరిట సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రం!!
3 లక్షల 73 వేల కోట్ల రుణభారం ఉందని కాగ్ నివేదిక.
(1/10)
కాగ్ తాజా లెక్కల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏడాది రుణ పరిమితి Rs 48,295.59 కోట్లు...కానీ ఏప్రిల్ 2020 నుండి నవంబర్ 2020 వరకు ఏడు నెలలలోనే సంవత్సర పరిమితిని మించి 73,811.85 కోట్ల రూపాయల అప్పు.
(2/10)
సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం కేవలం ఒక్క నవంబర్ నెలలో 13,001కోట్ల రూపాయల అప్పు!!
దీని వలన అంచనా వేసిన సంవత్సర ఆదాయ లోటు18,434.15 కోట్లు నవంబర్ నెలాఖరు లోపే 57,925.47 కోట్లకు చేరింది.
(3/10)
కాగ్ అంచనాల ప్రకారం 2020-21 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ మూలాల నుండి నెలకి సుమారుగా
9226.375 కోట్లు అప్పు చేసింది.ఇదే తీరు కొనసాగితే మార్చ్ 2021 కి మరొక 30 వేల కోట్లు రుణం ఏర్పడి మొత్తం అప్పు 1.04 లక్ష కోట్లకు చేరే అవకాశాలు ఉన్నాయని కాగ్ నివేదికలో పేర్కొంది.
(4/10)
జూన్ 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో రుణ భారం 97,000 కోట్లు. ఆ తరవాత 5 సంవత్సరాలలో అంటే మార్చ్2019 వరకు 2,58,928 కోట్లకి చేరింది.
ఏప్రిల్2019 నుండి నవంబర్2020 వరకు
1,14,212.81 కోట్ల బ్యాంక్ రుణాలు తీసుకోగా అందులో 1,06,866.25 కోట్లు జూన్2019 నుండి అంటే జగన్ గారి హయాంలోవే!!
(5/10)
కోవిడ్ వలన రాష్ట్ర ఆదాయకొరత ఏర్పడిందని ప్రజలనుండి 21,000కోట్ల రూపాయలు వివిధ రకాల పన్నులు పేరిట వసూలు చేశారు. దేశం మొత్తం లాక్డౌన్ విదించినప్పటికి మొదటి త్రైమాసికంలో మన రాష్ట్ర ఆదాయం 46,589కోట్లు.ఇంతేగాక కేంద్ర ప్రభుత్వం అదనపునిధులు 8వేల కోట్లు మన రాష్ట్రానికి విడుదల చేసింది
6/10
కానీ ఆమొత్తాన్ని ఉచిత పథకాల పేరిట ఖర్చు పెట్టి కేవలం 8 నెలల్లో ప్రభుత్వ ఆదాయ వ్యయం 70,082.90 కోట్లుకు తీసుకువచ్చారు.

State Development Corporation పేరిట కేవలం బ్యాంకులోన్ల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 10 వేల కోట్లు SBI, Canara Bank,PNBలనుండి అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం!
7/10
అమ్మ ఒడి పథకం కింద 43 లక్షల మందికి 15,000 చొప్పున పంచటానికి SBI నుండి మరొక 3000 కోట్ల విడుదల కొరకు ఎదురుచూపులు. కానీ వాస్తవానికి ఆ 15,000 రూపాయలలో 1000 రూపాయలు Toilet development fund కింద తగ్గించి14,000 మాత్రమే అందిస్తున్నారు.

(8/10)
ఈ పరిణామాలన్ని గమనిస్తుంటే అప్పు చేసి పప్పు కూడు తింటునట్లు అనిపిస్తుంది.

ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం ప్రస్తుతం ఉన్న అప్పుల మీద వడ్డీ తీర్చటానికే 35,000 కోట్లు అవసరం అవుతుంది.

(9/10)
గత 19 నెలల సమయంలో ప్రజల నుండి వసూలు చేసిన పన్నులు 75 వేల కోట్లు, దీనికి అదనంగా చేసిన అప్పు1.5 లక్షల కోట్లు..

మన రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక రుణాలు మరియు అత్యల్ప అభివృధ్ధి బాటలో పయనిస్తోంది అన్నదానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది!

#YSJaganFailed 👎
(10/10)
You can follow @KiranBoidhapu.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.